Sunday, 15 June 2014

“గుహ్యెశ్వరి”


                                                               “గుహ్యెశ్వరి” 
శ్రీ “గుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయ” దేవి మొదలైన పేర్లుగల ఈ శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోని “బాగమతి” నది వడ్డున, “పశుపతినాథ్ దేవాలయం” దగ్గర వున్నది !!

“గుహ్యెశ్వరి” అనగా-(గుహ్య – రహస్య/రహస్యాంగ) – “ఈశ్వరి” అనగా ”దేవత”–“రహస్యాంగ దేవత” అని పూర్తి అర్దం..!
సతీదేవి “రహస్యాంగమ్”(Private Part) -“రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువా”హాతి (గౌహతి) లోని “కామాఖ్యదేవి ఆలయం” వద్ద, “రెండో” భాగం(Inner Parts) ఈ ప్రదేశంలో పడిందని ఇతిహాస కధనం..! 
ఈ‌ ఆలయం పూర్తిగా “తాంత్రిక విద్యోపాసన”కు సంబందించినది. “తాంత్రికులకు” అతి ముఖ్యమైన “ఉపాసన” స్థలంగా చెపుతారు!!
ఈఆలయం విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికి “హిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం లేదు.!
పూర్వం ఈ ఆలయం ఒక చిన్న “ఖాళీ ప్రదేశంలో” వుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా ఈ దేవిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ పరిణామ క్రమంలో భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల” 17 వ శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు.



ఈ ఆలయం “భూటాన్ దేశ సంస్కృతికి అనుగుణంగా వారి “పగోడ” ఆకారంలో నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగా “వుండకపోవటం” ఆశ్చర్యంగా వుంటుంది.!
ఐతే, ఈ ఆలయ “ప్రధాన మందిరం” పుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటు” అదే “సహచర-జంట”(same couple) లుగా “పునర్జన్మలు” ఎత్తుతారని ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం ! 
ఈ ఆలయంలో జరిగే “నవరాత్రి పండుగ”ల సందర్భంగా నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు కలిసి “భాగమతి” నదిలో పవిత్ర స్నానం చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!
పెళ్ళైన వారు, తమ భర్తల ఆరోగ్యం కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగే “శత్రు-విజయం” కోసం కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!




శ్రీశైలము

                                             శ్రీశైలము
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.

శ్రీశైల స్థల పురాణము
పురాణాలలో శ్రీ శైలం శ్రీశైల చాలా పురాతన మైన మహాక్షేత్రము. ఇందు పర్వతుడను నైష్టిక బ్రహ్మచారి యొకడు పరార్థ ప్రవణు డై కారణ జన్ముడ వ దాగిన వాడు. కృత యుగ మున బహుకాలము త పమొనర్చినాడు. అతడు లోకమునుద్ద రింప సంకల్పి౦ఛి నాడు. తను పరార్ధ ప్రవణత చె బర మేశ్వరుని సైతము విస్మయంపడ జే సినాడు. తన తప: ఫలముగా సర్వ తీర్ధ ములలో సర్వదేవతలతో సర్వపర్వతములతో స్వర్గ మర్త్య పాతాళ స్దిత ములగు నిఖిలదివ్య పదార్ద ములతో సకల మహో ష ధులతో సదాశివుని, పరా శక్తి యగు పార్వతితో పాటు నిత్య ము తన యందు సంనిహితుడ గునట్లు తానే నాడో చేయగలిగి నాడు. శ్రీ శైల క్షేత్ర మహిమలు విప్పు చెప్పు స్కంద మందలి శ్రీ శైల ఖండము నాది యుగమందు పార్వతికి బరమేశ్వరుడి చ్చటనే చాల కాలము నాడు పంచిచి నాడు. ఈ శ్రీ శైల ఖండము నుండి రస వంతమగు మహా గ్రంథము గా ప్రవచించి, వ్యాస మహర్షి దీని సు పాయసముగా శ్రీ మల్లి కార్జున మహా దేవునికి సమర్పించుట, యాతని వలన వరములు వడయుట జరిగి బహు కాలమైనది. అవతార పురుషుడ గు శ్రీరామచంద్ర మూర్తి సీతామదేవితో నిటకు వచ్చి యిచ్చట గిరి ప్రదక్షిణ మొనర్చి తన బ్రహ్మ హత్యను దొలగించుకొనుట జరిగి యెంత కాలమో మైనది. ఇందు దాహరింపబడిన ప్రదక్షిణ విధ లో రామప్రదక్షిణ మొకటి. శ్రీరాముడు రావణ వదానంతరము తనకు దాపరించిన బ్రహ్మహత్యను బాపుకోనుట కై సేతువుకడ రామ లింగేశ్వర ప్రతిష్ట మొనర్చి నాడు. కాని, నిశ్శే షముగా దాని నిండి విముక్తుడు గాలేదు. అతడు వశిష్టాదులు నియోగింప నిటకు వచ్చి యీ గిరి ప్రదక్షణ మొనర్చి దానిని దొలగించు కొనినాడు. స్పష్టముగా శ్రీ శైల ఖ౦డ ము దీ నిని వచి౦ చు చున్నది. ఈత ని యీ గిరి ప్రదక్షిణ ఉత్తర ద్వార మగును మాహేశ్వర ము నుండి యారంభ మైనది. అ సమయమున రాముడి ట సీతా సహితు డై ఒనర్చిన ప్రతిష్టలు గూడ జాలగాలవు. త్రిపురాంత కాదుల యందలి రామేశ్వరాల యా దు లప్పుడు వెలసిన వియే! మల్లి కార్జునాలయమున నే సీతారాములు ప్రతిష్ట కు జెందిన సహస్ర లింగేశ్వరాలయములు రెండు ప్రత్యేక ముగా భిన్న భిన్న స్ధలము లందున్నవి. అవి యిందులకు నిదర్శనము. ఇవిగాక, శ్రీశైలద్వారా ములుగా ఎన్నబడుచున్న త్రిపురాంత కాదులయందు రామప్రతిష్ట త ములగు రామేశ్వరాలయాదులు తత్తి ర్ధాదులు ఎన్ని యో స్కా౦దమున వీ నితొ పాటు వర్ణింపబడుచున్నవి. ఇది గాక, రాముడింత కు ముందే సీతా న్వేషణార్ధ ముదండ కారణ్యమున సంచరించుచు ఇటకు నచ్చినట్లు హరి వంశాంతర్గముగు నాశ్చర్య పర్వము 'శే షెధర్మ' మను పేరు ధీ నిని విశ దీ కరించినది. బ్రహ్మ ఇచ్చట తప మొనర్చి మల్లికార్జునునిని ప్రసన్నునిగా జే సుకొని యాత ని వలన దన యిచ్చా మాత్ర మున సృష్టి యంత ము జరుగునట్లు వరము వడ సి, సృష్టి యంత యు నిటనుండి జరిపినట్లు స్ధల నిర్దేశముతో శ్రీ శైలఖిండ ము మనకు జూటి చెప్పచున్నది.
శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
*
హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
*
గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

*
రైలు మార్గములు
భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.


*
శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు:
శ్రీశైల దేవాలయ ప్రాంతము, శ్రీమల్లికార్జునుని దేవాలయము,భ్రమరాంబిక అమ్మవారి గుడి, మనోహర గుండము ,నాగ ప్రతిమలు , పంచ పాండవులు దేవాలయాలు ,అద్దాల మండపము ,వృద్ద మల్లికార్జున లింగము:

*
మండపాలు, పంచమఠాల ప్రాంతము
సారంగధర మఠం,రుద్రాక్షమఠం,విశ్వామిత్రమఠం,నంది మఠం

*
అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు.
పాతాళ గంగ, సాక్షి గణపతి ఆలయము, శిఖరేశ్వరం, పాలధార, పంచధారలు, ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము